Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రమాబాయి అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తామని దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (డీబీఎస్ఏ) ఓయూ అధ్యక్షులు ముత్యాల ప్రశాంత్ అన్నారు. రమాబాయి అంబ్కేర్ 125వ జయంతి సందర్భంగా సోమవారం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రామాబాయి తన జీవితం మొత్తం డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం త్యాగం చేసిన మహా గొప్ప త్యాగమూర్తి అన్నారు. రమాబాయి అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో డీడీఎస్ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్, తెలంగాణ అమరుల లక్ష్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సనుగుల రంజిత్, డీబీఎస్ఏ నాయకులు దయాకర్, స్వరాజ్, భాస్కర్, అరుణ, ప్రతిభ ఆదివాసీ స్టూడెంట్ ఫోరమ్ కిషోర్, కష్ణ, విజరు, శ్రీశైలం, రమేష్, జంపన్న తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్ ఇండియా డిఫెన్స్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో రమాబాయి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్క డాకయ్య, మాజీ అధ్యక్షులు కర్కస్వామి, కర్క శివశంకర్, ఓబీసీ రాష్ట్ర నాయకులు భాశెట్టి నర్సింగరావు, శశికల, శివరామకష్ణ, రాజు, కర్క నిఖిల్, గురజాల రాజు, రెడ్డి, పెరుమాండ్ల టీంకు, కర్కనర్సింగరావు, సతీష్ రెడ్డి, దశరథ్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-ధూల్పేట్
125వ రమాబాయి జయంతి సందర్భంగా మాదిగ బంధు మిత్ర సంఘం సంఘం సభ్యులతో కలిసి చుడీబజార్లోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న హరిజన సేవక మండలి అధ్యక్షుడు ఎం.కష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.ధర్మేందర్, కమిటీ సభ్యులు.