Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి ముగ్గురు ఆశా వర్కర్లను నియమించాలని అదనపు కలెక్టర్ జాన్ శాంసన్కు స్థానిక ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు వినతిపత్రం అందజేశారు. లక్ష్మాపూర్ గ్రామంలో సుమారు 4500 జనాభా ఉందని జనాభాకు సరిపడా ఆశా వర్కర్లు లేరని మొత్తం జనాభాకు ఒక్కరే ఆశా వర్కర్ ఉన్నారన్నాఉ. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో గ్రామంలో ఆమె సేవలు అందివ్వలేకపోతున్నారని, నూతనంగా ముగ్గురు ఆశావర్కర్లను నియమించాలని విన్నవించామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు డప్పు సురేష్ పాల్గొన్నారు.