Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహబూబ్నగర్, గద్వాలలో ఎం.ఏ. తెలుగు కోర్స్ ప్రవేశపెట్టామని ఉప కులపతి ఆచార్య లక్ష్మీ కాంత్ రాథోడ్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ నివాస కార్యాలయంలో డాక్టర్ మంగళగిరి శ్రీనివాస్ రచించిన 'వివేచన వ్యాస సంపుటి' ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా ఆచార్య లక్ష్మీకాంత్ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. భాషా ప్రేమికుడు రమణకు సంపుటిని అంకితం ఇవ్వటం సముచితంగా ఉందన్నారు. అంకిత స్వీకతి ప్రసంగం చేస్తూ రమణ అధ్యాపకునిగా, పరిశోధకునిగా, రచయితగా శ్రీనివాస్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ శ్రీనివాస్ తెలుగు భాషా సాహిత్య వికాసానికి చేసిన సారస్వత పరిషత్ చేసిన కషిపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారని తెలిపారు. త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి పాల్గొన్నారు.