Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాదిగ బంధుమిత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుమన్
నవతెలంగాణ-ధూల్పేట్
రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పేంతవరకు వదిలేదని మాదిగ బంధుమిత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద డీఎస్పీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు చూడి బజార్ మాదిగ బంధుమిత్రుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని గౌరవించని, ఇటువంటి సీఎంను గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ యొక్క అత్యున్నత స్థానాన్ని పక్క దేశాలు గౌరవిస్తూ, కొనియాడుతుంటే గౌరవ ప్రథమమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఇలా మాట్లాడడం సిగ్గుమాలిన చర్యగా ఖండిస్తున్నామన్నారు.