Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో పమ్మి గ్రామంలో మధిర కెవిఆర్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ కోటా రాంబాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోనే దళిత ప్రజల ఇళ్ల జాగల స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మండల అధికారులు తొలగించిన స్థలాన్ని సందర్శించి ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి జాతి ప్రజలకు అంకితం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మండల అధికారులు అవమానకరంగా తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అనంతరం గ్రామంలోనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు పగిడికత్తుల ఈదయ్య, జిల్లా నాయకులు నూకల నాగేశ్వరరావు పాల్గొన్నారు.