Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి బీజేపీ మద్దతు ఇచ్చిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్రావు అన్నారు. రాబోయే ఎన్నికలలో రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్దమయ్యరని ఆయన అన్నారు. గురువారం బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌతమ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరిక, ఆకాంక్షల మేరకే భారతీయ జనతాపార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి మద్దతు ఇచ్చిందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయ్యడం అంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. కాకినాడ తీర్మానం రాజకీయ చరిత్రలో రాజకీయ తీర్మానం చేసిన తొలి పార్టీగా బీజేపీ నిలిచిందని వెల్లడించారు. బీజేపీ మద్దతు లేనిది తెలంగాణ వచ్చేదా అని ఆషయం తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం 317 జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయ్యలని డిమాండ్ చేశారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నౌకని అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాలక్స్మీ రామన్గౌడ్, పద్మ వెంకట్రెడ్డి, అమత, ఉమా రమేష్ యాదవ్, వెల్దండ వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సందీప్ సాయి, కృష్ణగౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.