Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ
నవతెలంగాణ-బంజారాహిల్స్
హిజబ్ ధరించడం సరికాదని కర్ణాటకలో ముస్లిం మహిళలపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ అన్నారు. గురువారం బంజారాహిల్స్లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం అనేక మతాల సమ్మేళనం అని అన్నారు. ఎవరి మతాల కట్టుబాట్లకు వారు అనుగుణంగా జీవించే హక్కును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించాలని తెలియజేశారు. రాజ్యాంగాన్ని దేశంలో సరిగ్గా అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి మనుగడ సాగదని, అందుకే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మత విధ్వంసాలను సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. వెంటనే ముస్లిం మహిళలపై వేధింపులు ఆపి రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.