Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
క్రీడలతో శారీరక మానసిక ఎదుగుదల ఉంటుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో శుక్రవారం మల్లారెడ్డి క్రికెట్ టోర్న మెంట్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్రీడాకా రులు నిత్యం సాధన చేస్తూ ఇలాంటి టోర్న మెంట్లతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానించాలని ఆకాంక్షించారు. ఘట్కేసర్ మండలం లోని అన్ని గ్రామాల నుంచి క్రికెట్ టీమ్లు టోర్నమెంట్లో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన టీమ్లకు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందజేయను న్నట్టు తెలిపారు. అనంతకు ముందు క్రికెట్ టీమ్లతో కరచలనం చేసి అనంతరం మంత్రి బ్యాటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర భద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు కొంతం వెంకట్ రెడ్డి, యాదగిరి, ఎంపీటీసీ నీరుడి రామారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రవీన్ రెడ్డి, వెంకటాపూర్ ఉపసర్పంచ్ కట్ట సత్యనారాయణ, నాయకులు భైనగారి నాగరాజు, నీరుడి శ్రీనివాస్, బండారి శ్రీనివాస్ గౌడ్, డొంకని భిక్షపతి గౌడ్, బండారి అంజనేయులు గౌడ్, బస్వరాజ్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.