Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరం అని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్, గౌతమ్ నగర్, దయానంద నగర్ ఏరియాల వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 11 మంది లబ్దిదారులకు కార్పొరేటర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఒక్కో లబ్దిదారునికి రూ.లక్షా 116 అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, గౌతమ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.