Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పార్కుల అభివృద్ధితో ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం అందనుందని చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీలో దాదాపు రూ.15 లక్షల మున్సిపాలిటీ పట్టణ ప్రగతి నిధులతో నిర్మిస్తున్న పంచతత్వ పార్కును శుక్రవారం చైర్మెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్, నాయకులు నల్లవెల్లి శేఖర్, రాఘవేందర్ రెడ్డి, సంతోష్ నాయక్, బాలగోని శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.