Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ ఫలక్నుమా టౌన్ ప్లానింగ్ ఏసీపీగా రామ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఏసీపీగా పనిచేసిన కష్ణకుమారి బదిలీ కాగా, ఆమె స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసిందన్నారు. ఫలక్నుమా సర్కిల్ పరిధిలోని భవన నిర్మాణదారులు నూతన నిర్మాణాలు చేపట్టేందుకు టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు.