Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియల్ఎస్టేట్ వ్యాపారులు
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ 27వ డివిజన్ కార్పొరేటర్ తోట శ్రీధర్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ చేసిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నాదర్గుల్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇంద్రసేన, ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్లు కోరారు.
ఆదివారం నాదర్గుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడాతు నాదర్ గుల్ గ్రామంలో 2015లో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. 1985లో ఇతర గ్రామాలకు చెందిన వారు మా గ్రామంలో బంగారు జంగయ్య అను వ్యక్తి తన ప్లాట్లను నాయి బ్రాహ్మణులకు అమ్మినట్లు ఆ ప్లాట్లను 733 సర్వే నెంబర్ జాజిరెడ్డి అను వ్యక్తి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్లాట్లలో ఉన్న కడ్డీలను తొలగించినట్లు వారు తెలిపారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతు గ్రామ పెద్దలను ఆశ్రయిం చారని, వారికి న్యాయం చేయడానికి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుండి తమతో పాటు కార్పొరేటర్ శ్రీధర్ రెడ్డి రావడం జరిగిందన్నారు. ప్లాట్లకు, శ్రీధర్రెడ్డికి ఎలాంటి సంబంధంలేదని అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. మానవతా దక్పథంతో శ్రీధర్ రెడ్డిపై కలెక్టర్ న్యాయ విచారణ చేసి సస్పెండ్ ఎత్తి వేయాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులు బంగారు బాబు, నిమ్మల శ్రీకాంత్గౌడ్, పి.సంతోష్ కుమార్, ఐలయ్య, జంగయ్య, శంకర్, మహేందర్, జగన్మోహన్రెడ్డి, మల్లేష్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.