Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి పేరుతో కోట్లాది రూపాయలతో అభివద్ధికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడలో 24, 26 డివిజన్లలో రూ.2కోట్ల 50లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివద్ధి పనులకు మేయర్ పారిజాత నరసింహ్మరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డిలతో కలిసి అభివద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి లాగా పట్టణాల్లో ప్రగతి దిశగా అడుగులు ముందుకు వేయటం జరిగిందన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రోడ్ల నిర్మాణానికి రూ.20కోట్లు, కార్పొరేషన్ల నుండి జీహెచ్ఎంసీకి లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. నగర శివారు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు నిధులు మంజూరు చేయటం జరిగిందమని తెలిపారు. నగర శివారు కార్పొరేషన్, మునిసిపాలిటీలకు నూతనంగా తాగునీటి పైపు లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నగరంలో లాగా నీటి ఇంటింటకీి నల్లాల ద్వారా నీటిని సరఫరాకు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో పట్టణ అభివద్ధికి కషి చేస్తున్నారని తెలిపారు. రాష్టంలో వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదన్నారు. అభివద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజల కనీస సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందన్నారు. ఒకే రోజు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రూ.371కోట్లతో అభివద్ధి పనులకు ఇటీవలే అభివద్ధి పనులకు శంకుస్థాపలు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ సమగ్రాభివద్ధే ధ్వేయంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, దీపిక శేఖర్ రెడ్డి, సుర్ణగంటి అర్జున్, డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈ, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.