Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-ఓయూ
కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలి అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ, సామాజిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న టాప్ క్లాస్ స్కాలర్షిప్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని 34 ర్యాంకు, ఎన్ఏసీసీ ఏ గ్రేడ్ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని టాప్ క్లాస్ స్కాలర్షిప్ లిస్ట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్, రాష్ట్ర నాయకుడు అరవింద్, ఓయూ ఉపాధ్యక్షుడు విజయ నాయక్, కరణ్, శీను, రమేష్, సతీష్, నరేష్, వినోద్, దినేష్ పాల్గొన్నారు.