Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
నిరుపేదల అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు కృషిచేయలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలోని గ్రామ పంచాయితీ ఆవరణలో సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డితో కలిసి యుక్త షౌండేష్ సామాజిక అవగాహణ కరపత్రం విడుదల చేశారు. అంతకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి సంస్థలు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్, మైనార్జీ సెల్ మండల అధ్యక్షుడు ముస్తాఫా, మండల యూత్ అధ్యక్షుడు మధు, ఫౌండర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.