Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
గోల్నాక డివిజన్ పరిధిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను స్థానిక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. సోమవారం గోల్నాక డివిజన్ పరిధిలోని శంకర్ నగర్లో కార్పొరేటర్ కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తులసిరామ్ నగర్, శాంతి నగర్, కష్ణానగర్, నెహ్రూనగర్, సుందర్ నగర్ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలను తీర్చాలని, రోడ్డు పనులను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. గోల్నాకను సుందరమైన డివిజన్గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని తెలిపారు. డివిజన్ పలు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి సమస్యలను త్వరగా పూర్తిచేసే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.