Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అనారోగ్యంతో మరణించిన పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్లో మున్సిపాలిటీ కార్మికుడు పత్యపు శివకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎన్. సబిత డిమాండ్ చేశారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ గ్రామానికి చెందిన పత్యపు శివకుమార్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికుడిగా ఎన్నో సేవలు అందించాడని, అలాంటి వ్యక్తి మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో వీధిన పడ్డారని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక యూనియన్ నాయకులు గాంధారి అశోక్, నల్లవేల్లి దాసు, పల్లెర్ల మంజుల. లత, శాంతమ్మ, సదాశివ, రమేష్, భవిత, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.