Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో విద్య, క్రీడల్లో రాణించాలి అని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఓయూలో సోమవారం ఉదయం 2కె రన్ నిర్వహించారు. సేవాలాల్ స్ఫూర్తితో ఆయన సూచించిన సూత్రాలతో జీవితంలో విద్యార్థులు విద్యా, క్రీడల్లో రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం కోసం నడక, వ్యాయామం ఎంతో మంచిదన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్, బంజారా ప్రొఫెసర్స్, జేబీఎల్ స్పోర్ట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.