Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్ నగర్
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 'చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు' కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ వారోత్సవం నిర్వహించారు. మంచుకొండ ఫౌండేషన్ వారు 150 కథల పుస్తకాలు విరాళంగా పాఠశాలకు అందజేసినట్టు మందడి వెంకట్ రెడ్డి తెలిపారు. అనంతరం డిప్యూటీ డీఈఓ ఖాజ ముఖరం మాట్లాడుతూ గ్రంథాలయ పుస్తకాలను, కథల పుస్తకాలను, మ్యాగజైన్లను, పజిల్స్లను రోజూ పఠనం చేయడం ద్వారా విద్యార్థులకు చదవడం భాషపై అవగాహన పెరుగుతుందన్నారు. మంచికొండ ఫౌండేషన్ కో-ఆర్డినేట్ శ్రవణ్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అమ్మాజీ, నిర్మల, సుజాత, రేష్మ, హదయ మేరీ, తదితరులు పాల్గొన్నారు.