Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
మజీద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాటమయ్య గుడికి 400 గజాల స్థలంను గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 221 లో కాటమయ్య గుడి కోసం 400 గజాల స్థలం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పోచంపల్లి యాదమ్మ, మల్లారెడ్డి కుమారులైన తాము నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమిలోని స్థలాన్ని గుడికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలకు విధేయతగా ఉంటూ వారి సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మున్ముందు మరింత అభివృద్ధి సాధికారత సాధించుటకు కీషి చేస్తానని తెలి పారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.