Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ వెల్లడించారు. మంగళవారం లింగంపల్లిలోని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అంగన్వాడీ గ్రామ సేవకులు ఆర్టీసీ హెల్త్ అండ్ సానిటేషన్ వాటర్ వర్క్స్ తదితర ఉద్యోగులకు ఊహించిన దాని కంటే ఎక్కువ వేతనాలు పెంచారని గుర్తు చేశారు. 16వ తేదీ అర్ధరాత్రి తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్ డే వేడుక లకు కార్మికలోకం హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నారాయణ, ఉపాధ్యక్షులు మారయ్య, దానకర్ణ చారి, కార్యదర్శులు శివ కుమార్, మారుతీరావు, శ్రావణ్ కుమార్, నిర్మలారెడ్డి, అనిల్, గడ్డం శ్రీను, రవీందర్ రెడ్డి, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.