Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం చిల్కానగర్ ప్రధాన రహదారిలో జిల్లెల్ల సతీష్ రెడ్డి ఏర్పాటు చేసిన పిక్ అండ్ బై అధునాతన సూపర్ మార్కెట్ను స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ గీత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పిక్ అండ్ బైలో సూపర్ మార్కెట్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. కొత్తగా చిల్కానగర్లో 8వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఒకే దగ్గర లభించే ఇటువంటి సూపర్ మార్కెట్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత జిల్లెల్ల కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.