Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్కట్ చేయడంతో పాటు సుమారు 250 మంది జలమండలి సిబ్బంది, కార్మికులకు ఐదు రకాల పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీవో నాయకులు మాట్లాడుతూ.. 60 ఏండ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చిన సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందిస్తూ మరింత మేలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగలోకమంతా కష్టపడి పని చేస్తోందన్నారు. టీజీవో హైదరాబాద్ జిల్లా కోశాధికారి, టీజీవో జలమండలి శాఖ అధ్యక్షులు ఎండీ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీజీవో హైదరాబాద్ అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, కార్యదర్శి టి.హరికృష్ణ, అసోసియేట్ ప్రసిడెంట్ ఎన్.శ్రీనీష్, టీజీవో జలమండలి శాఖ కార్యదర్శి చంద్రజ్యోతి, టీజీవో హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు బి.స్వరూప, ఈసీ మెంబర్ జే.పూనమ్, కార్యనిర్వాహక కార్యదర్శి గోపిచంద్, జలమండలి శాఖ అసోసియేట్ ప్రసిడెంట్ పి.సంతోష్ కుమార్, సోషల్ వర్కర్ ఏవీ రావు, టీఎన్జీవో జలమండలి శాఖ అధ్యక్షులు మహేష్ కుమార్తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.న