Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచి ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకాలపై మక్కువ పెంచుకుంటున్నారు. అరేబిన్ మండీ బిర్యానీపై మనసు పారేసుకున్నారు. యువత ఈ బిర్యానీని రుచినీ ఆస్వాదించేదుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు అనుగుణంగానే మండీ హోటల్స్ పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండి అంటే బిర్యాని అర్థం. మండి బిర్యానీ ధర సాధారణ బిర్యానీలకు కాస్త అటు ఇటుగానే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఒకే ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినడం మండి ప్రత్యేకత.
ప్రత్యేక ఆకర్షణగా
గ్రాడ్యూయేట్ అరేబియన్ మండి
ముషీరాబాద్లో అనేక బిర్యాని సెంటర్లు, మండి బిర్యాని సెంటర్లు వెలసిన అందులో ముఖ్యంగా యువత ఫ్యామిలీతో వచ్చేవారు ఎక్కువగా గ్రాడ్యూయేట్ అరేబియన్ మండి హోటల్ వైపు ఆకర్షితులవుతున్నారు. మండి రుచులను ఆస్వాదించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ హోటల్ పేరులో గ్రాడ్యూయేట్ అరేబియన్ మండి అని ఉండటంతో ప్రత్యేకత సంతరించుకుంది అందులో హోటల్లోని మండి రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కసారి రుచి చూసిన వారు మరల హోటల్ను సందర్శించి ఆస్వాదిస్తున్నారు. ధర కూడా ప్రజలకు అందుబాటులో ఉండడమే ఇక్కడి మరో ప్రత్యేకత.
హోటల్ నిర్వహణ
ఇద్దరు ప్రాణ మిత్రులు వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ధృడ సంకల్పంలోంచే ఆవిర్భవించింది. ఈ గ్రాడ్యుయేట్ అరేబియన్ మండీ బిర్యాని సెంటర్ యువత ఉన్నత చదువులు చదివి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగనికై నమ్మకంతో పోటీలో ఉంటారు. కానీ ప్రతి గ్రాడ్యూయేట్కి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. నిరుద్యోగులు ఉద్యోగం రాక ఏమీ పాలుపోని స్థితిలో జీవితాలను గడుపుతున్నారు వారిలో స్వయం ఉపాధి ద్వారా వ్యాపార రంగంలో దూసుకెళ్లి వచ్చు అని తెలపడానికి ఇద్దరు మిత్రులు తమ ఆలోచనకు పదును పెట్టి ముందడుగు వేస్తూ నగరవాసులకు పసందైన మండి బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు. యువత తమ ఆలోచనలకు పదును పెడితే ఎంతటి విజయం అయిన సాధించవచ్చని బిర్యాని సెంటర్కు గ్రాడ్యుయేట్ అరేబియన్ మండి అని నామకరణం చేయడం జరిగింది. ఈ మండి బిర్యాని సెంటర్కు ఫ్యామిలీతో వచ్చే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మండి రుచులను ఆస్వాదించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోషక విలువలు పుష్కలం
మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానిలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు. ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్లు కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత
సాధారణంగా హోటల్కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్ వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్ను అనుసరిస్తున్నాయి. ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు.