Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్
నవతెలంగాణ-ఉప్పల్
గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు అన్నారు. వారికి తగు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామంతపూర్లో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బార్డర్ ట్యాక్స్లను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కరోనా మూలాన దెబ్బతిన్న ఓనర్స్ గురించి, డ్రైవర్స్ గురించి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక బార్డర్ టాక్సీలు తీసివేయాలని, పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ చలాన్ ఇష్టం వచ్చినంత వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అసోసియేషన్ సమస్యలపైన దష్టి పెట్టి పరిష్కార మార్గం కనుగొనాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. పోకల మల్లేశం, ఆనంద్, సోమయ్య, అశ్విన్రెడ్డి, రమణారెడ్డి, హరీష్, అనిల్ ఆల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.