Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న పుట్టిన రోజును పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా అనుక్షణం ప్రజల కోసం పరితపించే నాయకురాలిగా గంధం జ్యోత్స్న ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రజల మనిషిగా ఉన్న గంధం జ్యోత్స్నకి భవిష్యత్తులో పార్టీ తరఫున మరిన్ని పదవులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గంధం ఫౌండేషన్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజ్, బన్నాల గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, రామంతపూర్, చర్లపల్లి డివిజన్ నాయకులు పాల్గొన్నారు.