Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలో గల జెఎస్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హస్పిటల్ యాజమాన్య నిర్వాహకులు బి.శ్రీనివాస్ నాయక్ బి.జయంతి రవితేజ మాట్లాడుతూ హాస్పిటల్లో నిర్వ హించిన ఉచిత వైద్యశిబిరానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని వారు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ ధరలలో మెరుగైన వైద్య సేవలను అందించడమే తమ హాస్పిటల్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య బందంతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.