Authorization
Fri March 21, 2025 11:39:03 pm
నవతెలంగాణ-హయత్నగర్
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ పురోషోత్తం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ ప్రగతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సామ ప్రణరు కుమార్ రెడ్డి, తన తోటి బంధువు అయిన రఘుపతి రెడ్డి కలిసి ఈనెల 20న వారి స్వస్థలంలో పెండ్లికి వెళ్లారు. సోమవారం ఇంటికి వచ్చే సరికి వారి ఇంటి మెయిన్ డోర్ ను తెరిచి చూసే సరికి బీరువాలో ఉన్న 80 గ్రాముల బంగారం, 409 గ్రాముల వెండి, కొంత నగదు అపహరించుకుపోయారు. మొత్తం వాటి విలువ రూ.1,70,000 ఉంటుందన్నారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ టీం ఘటన స్థలానికి విచ్చేసి నిందితుల కదలికలు పరిశీలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.