Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అధికారులను కోరారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ బురుజు గల్లి హనుమాన్ టెంపుల్ నుండి హషీర్ ఖానా వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని జల మండలి అధికారులను కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ వెంకట్రెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షులు చుక్క జగన్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బాలకష్ణగౌడ్, సుజాత, సరళ, రాంరెడ్డి, బాలమణి, స్థానికులు భాస్కర్రెడ్డి, కిషోర్గౌడ్, ఇమ్రాన్, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ రవి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.