Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్/ఓయూ/హిమాయత్నగర్/ముషీరాబాద్
డ్రయినేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలపై బడ్జెట్ కేటాయించి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ మెట్రో వాటర్ వర్క్ ఎండీని కలిసేందుకు వెళ్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో ప్రజా సమస్యలను అణగదొక్క లేరు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, కార్పొరేటర్ జి.మహాలక్ష్మి రామన్ గౌడ్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మున్సిపల్ శాఖ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, నూతన డ్రయినేజీ వ్యవస్థ నిర్మాణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు దఫాలు ప్రజలు అధికారం కట్టబెట్టినా పాలించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని విమర్శించారు. రానున్న కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రజలకు సూచించారు.