Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు పరిధిలో డ్రయినేజీ సమస్య విపరీతంగా ఉందని, వాటికోసం ఎస్టీ సబ్ ప్లాన్ వార్డ్ నిధులు కేటాయించి సమస్య పరిష్కరించాలని వార్డ్ కౌన్సిలర్ శంకర్ నాయక్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ తండాలో కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తో కలిసి పర్యటించారు. తండాలోని వార్డు పరిధిలో డ్రయినేజీ సమస్య పూర్తిగా తొలగించేందుకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తే సమస్య పరిష్కరించేందుకు మార్గం సుగమంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు అమర్ సింగ్ నాయక్, హనుమంతు, శాంత, ప్రవీణ్ నాయక్, శివ నాయక్, గోపాల్ నాయక్ పాల్గొన్నారు.