Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తాగునీటి, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో జలమండలి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్తో సమావేశం తర్వాత నియోజక వర్గంలోని వివిధ డివిజన్ల పరిధిలో మంచినీటి మురుగునీటి సమస్యలతో పాటు వివిధ అభివద్ధి పనులకోసం రూ.9 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే అన్ని పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. సమావేశంలో జలమండలి జనరల్ మేనేజర్ హరీష్ శంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, వివిధ డివిజన్ల మేనేజర్లు వర్క్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.