Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా నగర కమిటీ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని సామూహిక లైంగికదాడికి గురై ఆత్మహత్య చేసుకున్న 20ఏండ్ల యువతి కేసులోని దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా నగర అధ్యక్ష,కార్యదర్శులు ఎ.పద్మ, కె.నాగలక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హింస పెరుగుతోందని, ఒకవైపు వరకట్న హత్యలు, పరువు హత్యలు, మరోవైపు లైంగికదాడులు ఆందోళనకు గురిస్తున్నాయని అన్నారు.
స్నేహితురాలి ఇంటికెళ్లిన యువతిపై సామూహిక లైంగికదాడి కేసు దోషులను ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా దర్యాప్తు చేయాలని, సూసైడ్ నోట్లో ఉన్న దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.