Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
మొక్కలు పెంచడం అంటే బావితరాలకు మంచి భవిష్యత్ అందించడమేననీ, ప్రకృతిని ప్రేమించడమ ంటే సమాజాన్ని ప్రేమించడమేనని పర్యావరణ ప్రేమికులు స్పష్టం చేశారు. గురువారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్షో షురూ అయింది. ఈ ప్రదర్శనలో వర్టీకల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్, వంటి నూతన టెక్నాలజీ ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి. కిచెన్, అవుట్ డోర్, ఎక్ సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సారు, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా డార్జిలింగ్, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగు ళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 100 స్టాల్స్ ప్రదర్శి స్తున్నారు. బోన్సారు వృక్షాలు, పూలు, పండ్ల మొక్కలు అబ్బురపరుస్తున్నాయి. గార్డెనింగ్ బీజీగా ఉండే నగరవాసులకు మానసిక ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని షో ఇన్చార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 28 వరకూ ఉద యం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ షో జరుగుతందని తెలిపారు. ఈ షోలో మెడిసినల్ ప్లాంట్స్, రకరకాల పండ్లు, పూల మొక్కలు, అగ్రికల్చర్, హార్టీకల్చర్కు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షించాల న్నారు. పర్యావరణాన్ని విస్మరిస్తే ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొంటున్నట్టు భవిష్యత్తులో ఆక్సిజన్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో నర్సరీ స్టాల్స్ తో పాటు మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్, ఫ్లవర్ ప్లాంట్స్, బల్బ్స్ ప్రదర్శించారు.