Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బోగారం గ్రామ పరిధిలోని గోరిల్లా బారు కుంట సర్వే నంబర్ 166, 264 లోని శిఖం భూమి కబ్జాకు గురవుతోందనీ, దానిని రక్షించండని బోగారం గ్రామస్తుడు జనగాం మహేందర్ భూపతి కోరారు. వందల ఎకరాలకు వ్యవసాయం నిమిత్తం నీటిని అందించిన గోరిల్లా భారు కుంటను కొందరు అక్రమార్కులు పూడ్చి వేసి ప్లాట్ల చేస్తున్నారని తెలిపారు. గతంలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కుంటను సందర్శించి అన్యాక్రాంతమైన భూమిని కాపాడాలని కోరారు.