Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఖైరతాబాద్ చింతల బస్తి రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నాయకులతో
బహుజన సమాజ్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. చాట్ల చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు రుద్రవరం సునీల్, ఉపాధ్యక్షులు దయానంద్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ బలోపేతం, రాజ్యాధికార లక్ష్యంగా చేయాల్సిన కార్యక్రమాలపై, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఇన్చార్జిగా దుర్గాప్రసాద్ నియామకమయ్యారు. సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అధ్యక్షుడు కేఎల్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఎస్ వీరబాబు, ప్రధాన కార్యదర్శి బాల నారాయణ, కోశాధికారి శ్రీకాంత్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.