Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విధులు నిర్వహి స్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎండ వేడిమిని తట్టుకునేందుకు కుషాయిగూడ చక్రిపురం చౌరస్తాలోని శ్రీరామ్ బేకరీ యజమాని కట్కూరి విజరు కుమార్ రెడ్డి 50 టోపీలను ఆదివారం కుషాయిగూడ డిపో మేనేజర్ డి.సుధాకర్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల కోసం టోపీలను అందజేసిన విజయకుమార్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, విట్ట ముకుంద రెడ్డి, పి.వేణుగోపాల్ రెడ్డి, నరేష్ నాయీ, తదితరులు పాల్గొన్నారు.