Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ సూరారం డివిజన్ పరిధిలోని శివాలయనగర్ శివహిల్స్లో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ముద్దాపురం మదన్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేడుకకు హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్యా భారతి స్వామి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. నూతన దంపతులు డాక్టర్ శివదత్, డాక్టర్ సుమన్వితలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ముద్దపురం మదన్గౌడ్ దంపతులు ఆశీర్వదించారు.