Authorization
Fri March 21, 2025 08:12:24 am
నవతెలంగాణ-బంజారాహిల్స్
మార్చి 1 నుంచి 10 వరకు జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ నిత్య అన్నదానం కొనసాగుతుందన్నారు. ఆలయానికి వచ్చే వారందరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయం ఉంటుందని ఆలయ అధ్యక్షులు జీవీ భాస్కరరావు చెప్పారు. కార్యక్రమంలో వై. ప్రసాద్, వెంకటరెడ్డి, ఎస్వీ రావు, బోజా రెడ్డి పాల్గొన్నారు.