Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
జగద్గిరిగుట్ట పరిసరప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు వారికి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయడానికి కృషిచేసిన బస్తీ వ్యవస్థాపకుడు మాధవరం నారాయణ రావు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేజ్ 1 షిరిడి హిల్స్ జయ శంకర్నగర్ కాలనీలో తమిళ వడ్డెర సంఘం, పెద్ద పూమాల, చిన్న పూమాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణా రావు తండ్రి మాధవరం శివయ్యగారి నారాయణ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాస్ రావు, సతీష్ గౌడ్, మంత్రి సత్యనారాయణ పాల్గొన్నారు.