Authorization
Fri March 21, 2025 07:36:13 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా ఇంతవరకు నూతన పెన్షన్ అమలు చేయలేదని సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ కన్వీనర్ రాపర్తి అశోక్ అన్నారు. అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖైరతాబాద్ డిప్యూటీ ఎమ్మార్వో అనిల్ కుమార్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఆసిఫ్, ఎం జయమ్మ తదితరులు పాల్గొన్నారు.