Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చంద్రమోహన్
నవతెలంగాణ-హస్తినాపురం
ప్రజల్ని కాపాడుకుందాం...దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఈనెల 28 మరియు 29వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయలని సీఐటీయూ పిలుపునిచ్చింది. సాగర్ రింగ్ రోడ్డు అలేఖ్య టవర్ దగ్గర పలు రాకల మార్బుల్స్లో పనిచేస్తున్న హమాలి కార్మికులతో జనరల్ బాడీ సమావేశాన్ని ఎల్బీనగర్ సీఐటీయూ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం. నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్మిక చట్టాలను రైతు చట్టాలను కాలరాస్తూ హక్కులు లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం ఈనెల 28, 29 దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని రెండు రోజుల సమ్మె జయప్రదం చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ తగ్గించి, రేషన్ దుకాణం ద్వారా ప్రజలందరికీ 17రకాల నిత్యావసర సరుకులు అందించా లని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదిహేను డిమాండ్లతో కూడిన. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదయ్య గౌడ్, కష్ణ, వెంకటయ్య, అజరు, నాంపల్లి యాదయ్య, సి.వెంకటయ్య ఏం.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోనగర్లో... సీిఐటీయూ ఆధ్వర్యంలో ఆటోనగర్లో కార్మికులను కలిసి ఈనెల 28, 29 తేదీలలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సీిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసర నర్సిరెడ్డి కార్మికులకు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుండి కార్మికవర్గంపైన రైతాంగంపైన మొత్తం ప్రజానీకంపై తీవ్రమైన దాడి చేస్తుందని, ఈ దాడిని ఎదుర్కోవాలంటే కార్మికులు, రైతు కూలీలు, మధ్య తరగతి ప్రజలు కలిసికట్టుగా పోరాడుదాం అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఎయిర్ సర్వీస్లను, రైల్వే, బొగ్గు, స్టీలు, చివరికి డిఫెన్స్ రంగముని కూడా అమ్మి వేయడం బిజెపి దేశభక్తికి నిదర్శనమన్నారు. సమ్మెను కార్మికులు, రైతులు, ఎగువ, దిగువ మధ్య తరగతి ప్రజలు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి భాస్కర్, సింహాద్రి, నరసింహ, లక్ష్మయ్య, రాములుపాల్గొన్నారు.