Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్నగర్
యాకుత్పురా నియోజకవర్గం సంతోష్నగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ రెస్టారెంట్ వద్ద 15 రోజుల తరబడి డ్రైనేజీ మురికి నీరు పొర్లుతున్న అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గంటలు కాదు, రోజులు కాదు నెలలు తరబడి పొంగిపొర్లుతున్నా అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. డ్రైనేజీ సమస్య అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దాఖలాలు లేవని బస్త్తీ వాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ వర్కర్స్ పరిధి లోని ఆయా ప్రాంతాలలో నిత్యం డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపై పొంగి పొర్లుతూ ప్రవహి స్తుంది. డివిజన్ పరిసర ప్రాంతాల్లో నిత్యం ప్రదక్షిణలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయా ప్రాంతాలవాసులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఓవైసీ చౌరస్తా, చంద్రాయణగుట్ట, శ్రీశైలం వైపు వెళ్లే హైవే రహదారి నుండి సంతోష్నగర్, ఐఎస్ సదన్, మాదన్నపేట్, సైదాబాద్, మలక్పేట, కోఠి, మహాత్మాగాంధీ బస్స్టేషన్ ప్రతిరోజు ప్రయాణి కులు వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఇకపోతే సమీపంలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు స్థానికులు, పాదచారులు, వాహనదారులు చిరు వ్యాపారస్తులు పరిధిలోని వివిధ ప్రాంతాలలో పొంగిపొర్లుతుండగా పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఇక్కడి అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల నివాసులు పేర్కొంటున్నారు. ఎప్పుడు చూసినా అధికారులు సిబ్బంది అందు బాటులో ఉండటంలేదని, దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో అయోమయంగా ఉందని ప్రజలు అంటున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు అందుబాటులో ఉండటంలేదని ఇక్కడి క్రింది స్థాయి సిబ్బంది తమకు ఏమీ తెలియదని తప్పించుకుంటున్నారు అని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు మామూలు సమయంలో నిత్యం పొంగి పొర్లుతూ రోడ్లన్నీ దుర్గంధం వెదజల్లుతూ జలాశయాలను తలపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే వరదనీటితో పొంగిపొర్లి డ్రైనేజీ మ్యాన్ హోల్ మూతలు సైతం పోతాయని అలాంటి సమయా లలో రాకపోకలు సాగించడానికి భయాందోళనలకు గురవుతున్నారని, అటు ప్రజలు ఇటు వాహనదా రులు అటు పోలీసులు వాపోతున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి తూతూమంత్రంగా చర్యలు చేపడుతు న్నారని ప్రాణాలు పోతే తప్ప వాటర్ వర్కర్స్ అధికారులకు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
డ్రైనేజీ పొంగి పొర్లుతున్నడంతో పనులు నిలిచిపోయాయి వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరి స్తున్నారు. ఇప్పటికైనా వాటర్ వర్కర్స్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.