Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రతి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని గౌతమి నగర్లో ప్రజా సమస్యలపై, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తక్షణమే పనులను పూర్తి చేయాలన్నారు. డివిజన్లోని ప్రతి కాలనీ, బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. అనంతరం కాలనీ సీనియర్ సిటీజన్ ఈశ్వర్రావుకు శస్త్ర చికిత్స అయిన సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో సీవరేజ్ లైన్మెన్ వెంకటేష్, కాలనీ అధ్యక్షులు ఎం.గంగాధరం, ప్రధాన కార్యదర్శి ఎం.వి.నర్సింహారావు, కోశాధికారి వల్లభనేని కుమారస్వామి, కాలనీవాసులు రామకృష్ణ, నరేష్, మూర్తి, రవికుమార్, పెద్ది శ్రీనివాస్, సుబ్బరాజు, అశ్వీనికుమార్, పూర్ణ ప్రసాద్, కోటేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటపతిరాజు, నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.