Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బడ్జెట్ పాఠశాలల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించేలా కృషి చేయాలని ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను బడ్జెట్ పాఠశాలల యజమాన్యాలు మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ట్యాక్స్ పైన 2 శాతం వడ్డీ వసూళ్ళు, ట్రేడ్ లైసెన్స్లు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల బడ్టెట్ పాఠశాలల యజమాన్యాల సంఘం చైర్మెన్ శివయ్య, అధ్యక్షులు ఆర్.వరప్రసాద్, కార్యదర్శి సి.హెచ్.మహేష్కుమార్, ముఖ్య సలహదారులు మండవ శ్రీనివాస్గౌడ్,వి.నర్సిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.రవి కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్, గొవర్ధన్రెడ్డి, సాధన రాజు, సుందర్రాజు, భాస్కర్రాజు, జిల్లా కో అప్షన్ మెంబర్ బాకర్ తదితరులు పాల్గొన్నారు.