Authorization
Wed March 19, 2025 08:33:53 pm
- కార్పొరటర్ సబీహా గౌసొద్దీన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
నాలాలోని చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. డివిజన్ పరిధిలోని రాజీవ్గాంధీనగర్ ముస్లిముల శ్మశాన వాటికను రానున్న షబే మేరాజ్ను పురస్కరించుకుని గురువారం పరిశీలించారు. అనంతరం సున్నం చెరువు నుంచి లక్ష్మీనగర్ వరకు ఉన్న నాలాలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సల్లావుద్దీన్, ఇస్మాయిల్, అస్లామ్, తదితరులు పాల్గొన్నారు.