Authorization
Wed March 19, 2025 03:02:07 am
- వాటర్ ఓఎస్డీ మనోహర చారి
నవతెలంగాణ-హయత్నగర్
భూ భాగంలో ఒక శాతం భూమి, మూడు శాతం నీరు ఉన్న పెరుగుతున్న జనాభాకు నీటి కొరత ఇంకా ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో నీటి సమస్య ఇబ్బందులు ఏర్పడతాయని వాటర్ వర్క్స్ ఓఎస్డీ మనోహర చారి సూచించారు. ప్రపంచ జల వనరుల దినోత్సవం సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని చంద్రపూరి కాలనీలో సీనియర్ సిటీజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడాలని,అప్పుడే నీటి సమస్య లు రావని కోరారు. ఆయన వెంట వాటర్ వర్క్స్ డీ జీఎం శ్రీనివాస్, వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రేం కుమార్ తదితరులు పాల్గొన్నారు.