Authorization
Fri March 21, 2025 09:06:46 am
- కార్పొరేటర్ విజయ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి అన్నారు. గురువారం డివిజన్ బుల్కాపూర్ నాలా రాజ్ నగర్, ఎస్టీపీ నుంచి చింతల్ బస్తీ వరకు జరుగుతున్న నాలా పూడికతీత పనులను జీహెచ్ఎసీ డీఈ చైతన్య, ఏఈ చరణ్లతో కలిసి పరిశీలించారు. అభివద్ధి పనుల్లో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రాజ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.