Authorization
Mon March 17, 2025 11:49:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్ లెవెల్ ఫెడరేషన్(టీ.ఎల్.ఎఫ్) స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (ఎస్.ఎల్.ఎఫ్) సమస్యలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గురువారం మహిళా సంఘాల నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పి.ఓ శ్రీనివాస్, సి.ఓ.లు జగదీశ్గౌడ్, వెంకట్ రెడ్డి, బాలరాజు, టి.ఎల్ఎ.ఫ్, ఎస్.ఎల్.ఎఫ్ నాయకులు ఇందిరా రెడ్డి, కల్పన, రమ్య కుమారి, గీత, మంగ, ఆసియా, అనిత, నాగ శిరోమణి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.