Authorization
Tue March 18, 2025 10:18:55 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రపంచ మలేరియా రోజు సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో మలేరియా పై నివారణ చర్యలు, అవగాహనా సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు మలేరియా పై వ్యాసరచన పోటీల్లో గెల్చిన వారికి బహుతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్, కౌన్సిలర్ నాను నాయక్, టీఆర్ఎస్ నాయకులు కొత్త భాస్కర్ గౌడ్, రాజు ముదిరాజ్, శ్రీరామ్, సాయి లత డాక్టర్ సిందుజ, ఏఎన్ఎంలు మంగ విజయ రాణి కవిత, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .